కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట…
ప్రముఖ మలయాళ నటుడు నెడుముడి వేణు (73) సోమవారం ఉదయం కన్నుమూశారు. రంగస్థలం నుండి 1978లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన నెడెముడి వేణు వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించారు. వివిధ కేటగిరీలలో మూడు సార్లు జాతీయ అవార్డును ఆయన అందుకున్నారు. ఆ మధ్య కొవిడ్ 19 బారిన పడిన వేణు ఆదివారం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. జ్ఞానశేఖరన్ ‘మొగముల్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెడుముడి వేణుకు శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’,…
దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్ ట్రాఫిక్ ను నిలిపివేసారు పోలీసులు. అయితే.. ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ మహిళ మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళను… ఆమె భర్త కారులో తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే…
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడు బలయ్యాడు. యాక్సిడెంట్ లో మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని మూడు రోజులపాటు గదిలో పడేసారు సిబ్బంది. అక్కడ ట్రీట్మెంట్ లేక తాగడానికి నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయాడు పులి కిరణ్. గత బుధవారం వరదయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనంలో వేళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పులి కిరణ్… వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా అస్పత్రికి తరలించారు వరదయ్యపాలెం పోలీసులు. ప్రమాదం తర్వాత మతి తప్పిన యువకుడు ఆస్పత్రి వద్ద…
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్(38) కోవిడ్ తో మృతి చెందారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వట్టి కుమార్ మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వట్టి కుమార్.. ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచాడు వట్టి కుమార్. వట్టి కుమార్ స్వస్థం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఇది ఇలా ఉండగా…‘మా అబ్బాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన…