Bus Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ఊటీ నుంచి మెట్టుపాళయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కూనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Also: Narendra Modi: రేపు తెలంగాణ పర్యటనకు వస్తూనే.. ఆ పార్టీలపై ప్రధాని మోడీ విమర్శలు
ఈ ఘటనకు సంబంధించి కోయంబత్తూరు జోన్ డీఐజీ శరవణ సుందర్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Bigg Boss Leaks: ఊహించిందే జరిగింది.. ఈవారం ఎలిమినేట్ అయింది ఎవరంటే?