Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధురలోని జైత్ గ్రామానికి చెందిన శివ్ సింగ్ తన కుటుంబంతో కలిసి కులేసరలోని మధుబన్ విహార్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం.. తన కుమారుడు సురేంద్ర సింగ్, కూతుర్లు శైలీ, అన్షు, తన స్నేహితురాలు సిమ్మితో కలిసి బైక్పై కస్నాకు వెళ్లినట్లు శివ్ సింగ్ చెప్పాడు. కస్నాలో వివాహ వేడుకకు వెళ్లినట్లు తెలిపాడు. అనంతరం నలుగురు బైక్పై రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు.
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Lore and George: వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు ఇకలేరు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 2.30 గంటల సమయంలో ప్యారీ చౌక్ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని… వారందరినీ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే.. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన బాలిక సిమ్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కాలు మొత్తం నుజ్జునుజ్జైంది. కాగా.. ఈ ఘటనలో గుర్తు తెలియని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సెక్టార్ బీటా-2 కొత్వాలి పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్లో కొడుకు సురేంద్ర సింగ్ పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇంట్లో పెళ్లి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో విషాదంగా మారింది. మరోవైపు.. ఒక్కసారిగా మూడు మృతదేహాలను చూసిన తల్లిద్రండుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!