హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
Gun Fire In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు తొలుత బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 5న ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో…
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి 10 మీటర్లు లాక్కెడంతో చనిపోయాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్ను మరుసటి రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్…
Best Teacher Awards: ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డులను ప్రధానం చేయబోతున్నారు.
Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు.
చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గోవింద్పురిలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని బాలుడు.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.