Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీ ఎన్నికల్లో దళితులకు ప్రాతినిధ్యం ఇవ్వండి..
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు..
- 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి..
- దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు: ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు. 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. అందులో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరిస్తామని.. ఖాళీగా ఉన్న పోస్టులకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటామని గతంలో ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు. ఇక, జోనల్ వార్డు కమిటీ ఎన్నికలను జాప్యం చేసేందుకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒబెరాయ్ తన పదవీ కాలాన్ని ఐదు నెలలు మించిపోయారని, దళిత అభ్యర్థిని మేయర్గా కాకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ఇక, ఒబెరాయ్ ప్రిసైడింగ్ అధికారులను నియమించకుండా వార్డు కమిటీ ఎన్నికలను నిలిపివేయడానికి ప్రయత్నించారు అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. ప్రక్రియను ఆలస్యం చేయడానికి కోర్టును ఆశ్రయించిన చివరికి అది తిరస్కరించబడింది. ప్రస్తుత ఎంసీడీ పదవీకాలం యొక్క మూడవ సంవత్సరంలో.. ఒబెరాయ్ పదవీకాలం మార్చి 31వ తేదీన ముగిసిన తర్వాత ఏప్రిల్లో దళిత అభ్యర్థిని మేయర్గా నియమించాలని ఆయన నొక్కి చెప్పారు. అయినప్పటికీ, ఒబెరాయ్ తన పదవిలో కొనసాగుతున్నారు. వార్డు కమిటీ ఎన్నికలను అడ్డుకున్నారు.. దీనిని “చట్టవిరుద్ధం”, రాజ్యాంగ విరుద్ధం” అన్నారు. ఎంసీడీ కార్యకలాపాలపై స్టాండింగ్, వార్డ్ కమిటీలు లేకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపారు. కౌన్సిలర్లు సమాజ అవసరాలను తీర్చలేకపోయారు అని మండిపడ్డారు. ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కమిషనర్ల మధ్య విభేదాలు పౌర వ్యవస్థను కుంగదీశాయని దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!