Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీ ఎన్నికల్లో దళితులకు ప్రాతినిధ్యం ఇవ్వండి..
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు..
- 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి..
- దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు: ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు. 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. అందులో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరిస్తామని.. ఖాళీగా ఉన్న పోస్టులకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటామని గతంలో ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు. ఇక, జోనల్ వార్డు కమిటీ ఎన్నికలను జాప్యం చేసేందుకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒబెరాయ్ తన పదవీ కాలాన్ని ఐదు నెలలు మించిపోయారని, దళిత అభ్యర్థిని మేయర్గా కాకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
ఇక, ఒబెరాయ్ ప్రిసైడింగ్ అధికారులను నియమించకుండా వార్డు కమిటీ ఎన్నికలను నిలిపివేయడానికి ప్రయత్నించారు అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. ప్రక్రియను ఆలస్యం చేయడానికి కోర్టును ఆశ్రయించిన చివరికి అది తిరస్కరించబడింది. ప్రస్తుత ఎంసీడీ పదవీకాలం యొక్క మూడవ సంవత్సరంలో.. ఒబెరాయ్ పదవీకాలం మార్చి 31వ తేదీన ముగిసిన తర్వాత ఏప్రిల్లో దళిత అభ్యర్థిని మేయర్గా నియమించాలని ఆయన నొక్కి చెప్పారు. అయినప్పటికీ, ఒబెరాయ్ తన పదవిలో కొనసాగుతున్నారు. వార్డు కమిటీ ఎన్నికలను అడ్డుకున్నారు.. దీనిని “చట్టవిరుద్ధం”, రాజ్యాంగ విరుద్ధం” అన్నారు. ఎంసీడీ కార్యకలాపాలపై స్టాండింగ్, వార్డ్ కమిటీలు లేకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపారు. కౌన్సిలర్లు సమాజ అవసరాలను తీర్చలేకపోయారు అని మండిపడ్డారు. ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కమిషనర్ల మధ్య విభేదాలు పౌర వ్యవస్థను కుంగదీశాయని దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!