మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ హస్తినకు చేరుకున్నారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఢిల్లీకి వచ్చారు. కమలం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎంలో తనకు ఘోరమైన అవమానం జరిగిందని చంపై సోరెన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లబుచ్చారు.
ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో సహా పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, సర్ గంగారాం వంటి పెద్ద, ప్రఖ్యాత ఆసుపత్రులకు ఏకకాలంలో బెదిరింపు ఇమెయిల్లు వచ్చాయి.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఢిల్లీలోని కరోల్ బాగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు.
Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు.