Crime: దారుణం.. పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మాజీ సైనికుడిని కొట్టి చంపిన మనవడు
- పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మాజీ సైనికుడిని కొట్టి చంపిన మనవడు
- ఢిల్లీ పరిధిలోని ఆజాద్పూర్ గ్రామంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఢిల్లీ పరిధిలోని ఆజాద్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వృద్ధుడు హవల్దార్ భోజరాజ్ 1962లో చైనా, 1965లో పాకిస్థాన్పై పోరాడిన యోధుడు. ఆయన ఆర్మీలో ఎనలేని సేవ చేశారని స్థానికులు చెబుతున్నారు. 1985లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆజాద్పూర్ గ్రామంలో నివసిస్తున్నారు.
READ MORE: Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర?.. కారణం ఇదే
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
బుధవారం తనకు పింఛను డబ్బుు పడ్డాయి. వృద్ధుడైన భోజరాజ్ తన పింఛనులో సగం తన చిన్న కొడుకు జైవీర్కి, మిగిలిన సగం మనవడు ప్రదీప్ మొదటి భార్యకు ఇచ్చేవారు. అయితే ప్రదీప్ తన భార్యకు ఇచ్చిన వాటా తనకు దక్కాలని కోరుకున్నాడు. ఈ విషయమై తాత, మనవడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వమని మనవడు ఒత్తిడి తెచ్చాడు. పింఛను ఇవ్వడానికి హవల్దార్ భోజరాజ్ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మనవడు తాతను కర్రతో బలంగా కొట్టాడు. గాయపడిన రిటైర్డ్ సైనికుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
READ MORE:Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం సైనీ పోటీ ఎక్కడనుంచంటే..!
క్రూరంగా ప్రవర్తించిన నిందితుడు..
ప్రదీప్ మొదట తన తాత బట్టలు తొలగించి, ఆపై కర్రతో కొట్టడం ప్రారంభించాడని, అతను స్పృహ కోల్పోయాడని స్థానికులు ఆరోపించారు. బాధితుడు భోజరాజ్ చిన్న కుమారుడు జైవీర్ తన తండ్రిని అలాంటి స్థితిలో చూడగానే.. చలించిపోయాడు. వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు ప్రదీప్ పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!