Best Teacher Awards: నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం..
- నేడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవం..
- జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల అందజేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Teacher Awards: ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డులను ప్రధానం చేయబోతున్నారు. కాగా, విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.. 28 రాష్ట్రాల నుంచి 50మంది ఉపాధ్యాయులు, 3 యూటీలు, 6 సంస్థల నుంచి ఎంపికయ్యారు. ఎంపికైన ఉపాధ్యాయుల్లో 34 మంది పురుషులు ఉండగా.. 16 మంది మహిళలు, ఇద్దరు వికలాంగులు, ఒకరు ప్రత్యేక అవసరాలు (CWSN) గల పిల్లలతో పని చేస్తున్నారు.
Read Also: America Elections : అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రవేశం! ఓటర్లపై కుట్ర జరుగుతోందని ఆరోపణ
Also Read
- Trisha - Vijay : త్రిష వల్లే విజయ్'కు ఇన్ని ఇబ్బందులా?
- Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
- Mamata Banerjee: 'మాజీ' అని పెట్టుకోను.. మమతా బెనర్జీ 'X' బయోలో తెలివైన మార్పు!
- Wedding Drama: వరమాల వేసే టైమ్లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్చేస్తే..
ఇంకా, అదనంగా, ఉన్నత విద్యా శాఖ నుంచి 16 మంది ఉపాధ్యాయులు, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ నుంచి మరో 16 మంది టీచర్స్ కు కూడా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్నారు. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి అవార్డుకు మెరిట్ సర్టిఫికెట్ తో పాటు రూ. 50,000 నగదు, రజత పతకం అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది.
తాజావార్తలు
-
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్