హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం 11ః30 గంటలకు బీజేపీలో చేరబోతున్నారు. ఉదయాన్నే ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢల్లీకి బయలుదేరారు. ఈటలతో పాటుగా మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరనున్నారు. దేవరయాంజల్ భూములను ఈటల అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను…
ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కనిష్టస్థాయికి కేసులు చేరుకోవడంతో లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్డౌన్ సడలింపుల సమయంలో కూడా కేసులు కేసులు పెద్దగా నమోదుకావడంలేదు. దీంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతులు మంజూరు చేశారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఢీల్లీలో పాఠశాలలు, సినిమా హాల్స్ మూసే…
ఈటల రాజేందర్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని స్పీకర్ అంగీకరించారు, ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరో ఆరుగురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.. అయితే, తనతో పాటు.. తన అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్పించాలని భావిస్తున్న ఈటల.. అందరూ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నారట.. ముఖ్యనేతలతో తనతో పాటు హస్తినకు…
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి.. పీసీసీ, ఇతర కమిటీలపై ప్రకటన చేసే సమయానికి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి.. ఉప ఎన్నికలు ముగిసేవరకు పీసీసీ ప్రకటన వాయిదా వేయాలంటూ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిపై ప్రకటన వాయిదా వేసింది అధిష్టానం.. ఎన్నికలు ముగిసిపోయినా.. దీనిపై ప్రకటన రాకపోగా.. పదవులకోసం మళ్లీ లాబియింగులు మొదలయ్యాయి.. తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ నియామక…
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్లో 111 మంది వైద్యులు,…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్గోయెల్,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్,పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు నీటి ఆయోగ్వైస్ఛైర్మన్ రాజీవ్కుమార్ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు…
సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. వరుసగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, గజేంద్రసింగ్ షెకావత్లను కలిసిశారు.. ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్తో భేటీ అయ్యారు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం… రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించినట్టు తెలిపారు.. ఇళ్ల పట్టాల…
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…