తాజాగా నిర్వహించిన హెల్త్ సర్వే ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో గుబులు రేపుతోంది.. తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడినట్టు తేలింది
CBI: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ వివాదంపై ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసింది. దేశ రాజధానిలోని 20 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, మనీష్ సిసోడియా తన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ, విచారణకు సహకరిస్తానని ట్వీట్ చేశారు. సిసోడియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పరిణామాన్ని ధృవీకరించారు. “సీబీఐ వచ్చింది. వారిని స్వాగతిస్తున్నాం. మేము చాలా…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు..
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ఇవాళ భేటీ కాబోతోంది. సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. పార్టీ అధినేత్రి సోనియా కోవిడ్ నుంచి కోలుకోగానే సీడబ్ల్యూసీనీ ఏర్పాటు చేసింది.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో…
దేశ రాజధానిలో ఘోరం జరిగింది. గోడ మీద ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడని ఓ బృందం అతడిని పొడిచి చంపేసింది. రద్దీగా ఉన్న మార్కెట్లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఆ వ్యక్తి హత్యకు దారి తీసింది.
దేశరాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు రోజుకు వేలల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యం అక్కడ ప్రజలు వైద్యం కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్లు లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Dasoju Sravan Joins BJP: దాసోజు శ్రవణ్ నేడు కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఇవాళ ఉదయం బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కు కసాయం కండువాకప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ…
సాధారణంగా ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్కు పరిగెడతారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంటారు. కానీ పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటి?. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకోగా.. రాత్రికి వైఎస్ జగన్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు..
మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కావడానికి సిద్ధం అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వరదల వల్ల తెలంగాణలో జరిగిన నష్టంపై అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు.