రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది.
Man Kills Wife: పాకిస్తాన్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జూలై 28న లాహోర్కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్ లో హత్య చేశాడు.
yashashree shinde case: నవీ ముంబైలో 20 ఏళ్ల యశశ్రీ షిండే హత్య కేసు సంచలనంగా మారింది. ఉరాన్ ప్రాంతంలో పొదల్లో ఆమె మృతదేహం కత్తిపోట్ల కలిగిన స్థితిలో దొరికింది. ఈ కేసులో నిందితుడిని కర్ణాటక గుల్బర్గాకు చెందిన దావూద్ షేక్గా గుర్తించారు. హత్య జరిగిన 5 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రిటన్లోని సౌత్పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు.
Rajoli Crime News: భూతగాదాలు ఎంతటి దారుణానికైనా దారితీస్తాయి. భూతగాదాల కారణంగా సొంత అన్న దమ్ములే బద్ద శత్రువులుగా మారతారు. అంతేకాదు చంపుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల కారణంగా సోదరుడిని హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మట్టుపెడదామనుకున్న ఇద్దరు అన్నదమ్ములు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి… జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్…
తమిళ్ రాకర్స్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పైరేట్ వెబ్సైట్లలో ఒకటి. చాలా సినిమాల పైరసీ ప్రింట్లు విడుదల రోజునే తమిళ్ రాకర్స్లో వచ్చాయి. ఈ పైరేట్ వెబ్సైట్ కారణంగా అనేక సినిమాలు ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఇంతలో ధనుష్ హీరోగా తాజాగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్ను అప్లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
Nithya Pellikoduku: దేశవ్యాప్తంగా 20కి పైగా వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల్ని నమ్మించి పెళ్లి చేసుకుని వారి నగలు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు.