Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
- కవాసకి నింజా 250 కొత్త బైక్ విడుదల
- కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్
- ఆకట్టుకునే ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్డేటెడ్ వెర్షన్లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ను జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.
కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్
కవాసకి నింజా 250లో 249cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అందించింది. ఈ ఇంజన్ 39 PS పవర్, 23.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్కు 6-స్పీడ్ గేర్బాక్స్ కు జత చేశారు. దీంతో నగర రోడ్లతో పాటు హైవేలపై కూడా మెరుగైన పనితీరు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్తో అదిరిపోయే ఫీచర్లు
ఆకట్టుకునే ఫీచర్లు
కొత్త నింజా 250లో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే పలు ఫీచర్లను అందించారు. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్గా లభిస్తుంది. అలాగే LED హెడ్లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్ను లైమ్ గ్రీన్, డార్క్ మెటాలిక్ అనే రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ధర ఎంత?
జపాన్లో కవాసకి నింజా 250 ధర 7.26 లక్షల జపనీస్ యెన్ గా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.4.37 లక్షలు అవుతుంది. అయితే, దిగుమతి సుంకాలు, పన్నులు వంటి కారణాల వల్ల ఇతర దేశాల్లో ధర మారే అవకాశం ఉంది.
భారత్లో లాంచ్ అవుతుందా?
ప్రస్తుతం భారత మార్కెట్లో కవాసకి నింజా 300 మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 250cc ఇంజన్తో నింజా 250ను భారతదేశంలో విడుదల చేసే ప్రణాళిక ప్రస్తుతం కంపెనీకి లేదని తెలుస్తోంది. దీంతో భారతీయ కస్టమర్లు ప్రస్తుతం నింజా 300నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!