Husband Murdered By Wife: ట్రెండ్ మారింది.. ఆస్తి కోసం భర్తను 30 ముక్కలుగా నరికిన భార్య
- ఆస్తి కోసం భర్తను
- 30 ముక్కలుగా నరికిన భార్య
- ఆస్ట్రేలియా సిడ్నీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Murdered By Wife: ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఆపై, అతని శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలలో విసిరివేసింది. సిడ్నీలో 53 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ నిర్మిన్ నుఫాల్ తన 62 ఏళ్ల భర్త మమ్దౌహ్ ఇమాద్ ను హత్య చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే 3వ తేదీన పశ్చిమ సిడ్నీలోని గ్రీన్కర్ హోమ్లో భార్య నౌఫల్ తన భర్తను కత్తితో పొడిచి హత్యా చేసింది. ఆ తర్వాత రంపంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిందని పోలీసులు తెలిపారు. హత్యానంతరం భార్య తన భర్త శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచులలో ఉంచి, వాటిని వివిధ ప్రదేశాలలో డస్ట్బిన్లలో పడేసిందని పోలీసులు తెలిపారు.
Also Read: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు
Also Read
దీని తరువాత భార్య నుఫాల్ను మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత గత నెలలో అరెస్టు చేశారు. అయితే, ఆమె భర్త మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. గతేడాది తమ ఇంట్లోనే నౌఫల్ తన భర్తను ఉద్దేశపూర్వకంగా చంపినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భార్య హత్య చేయడంతో భర్త హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో అతని కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిస్సింగ్పై ఫిర్యాదు చేశారు. మేలో అతను అదృశ్యమైన తర్వాత, సిడ్నీ పశ్చిమ ప్రాంతంలోని గ్రీన్కర్ లోని జూనో పరేడ్లో అతని ఇంటికి పోలీసులు వచ్చారు.
Also Read: NZ vs ENG: అబ్బా ఏం కిక్ ఉంది మామ.. సొంతగడ్డపై న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లాండ్
ఈ కేసుపై తాజాగా న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్మీన్ నౌఫల్కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వ్యక్తిగత కారణాల వల్లే భార్య నుఫాల్ తన భర్తను హత్య చేసిందని ఈ కేసులో లాయర్ తెలిపారు. భార్య నుఫాల్ తనకు సంతోషంగా లేని సంబంధం నుండి తప్పించుకోవాలనుకుంటుందని లాయర్ తెలిపారు. మే నెలలో ఈజిప్టులో ఆస్తిని సొంతం చేసుకునేందుకు భర్త నుండి భార్యకు చట్టపరమైన అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆమె ఆ సంబంధం నుండి బయటపడాలనుకునే అవకాశాన్ని చూసిందని లాయర్ కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్తను చంపిన తర్వాత నుఫాల్ ఈజిప్టుకు వెళ్లింది. అక్కడ ఆమె తన భర్త భూములను రూ. 1 కోటి 70 లక్షల విలువచేసే ఆస్తులను విక్రయించి, ఆపై ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిందని విచారణలో తేలింది. ప్రస్తుతం నుఫాల్ మానసిక అనారోగ్యంతో సహా అనేక వ్యాధులను ఎదుర్కొంటోంది. దాంతో ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 11కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?