Digital Arrest: 26 ఏళ్ల యువతి “డిజిటల్ అరెస్ట్”.. వీడియో కాల్లో బట్టలు విప్పాల్సి వచ్చింది..
- ‘డిజిటల్ అరెస్ట్’కి గురైన 26 ఏళ్ల యువతి..
- పోలీసుల్లా ఫోన్ చేసిన స్కామర్లు..
- బట్టలు విప్పేలా బలవంతం..
- ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ముంబైలో 26 ఏళ్ల మహిళ ఇలా ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. వీడియో కాల్ సమయంలో బట్టలు బలవంతంగా విప్పేలా చేశారు. పోలీసుల అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ స్కామ్లో రూ.1.78 లక్షలు మోసం చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 19-20 మధ్య జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అయిన మహిళకు ఢిల్లీ పోలీసులమని చెప్పుకునే వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. వ్యాపారవేత్త నరేష్ గోయల్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో యువతికి ప్రమేయం ఉందని బెదిరించారు.
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
Read Also: Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?
స్కామర్లు అనేక నంబర్లు ఉపయోగించి, ఆమెని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వర్చువల్ ఇంటరాగేషన్ కోసం ఒక గదిని బుక్ చేయమని బలవంతం చేశారు.వీడియో కాల్ సమయంలో నిందితులు బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ కోసం రూ. 1.78 లక్షలు బదిలీ చేయమని మహిళని మోసగించారు. ఆ తర్వాత ‘‘బాడీ వెరిఫికేషన్’’ కోసం డిమాండ్ చేస్తూ, ఆమెని బట్టలు విప్పమని బలవంతం చేశారు.
బాధితురాలు నవంబర్ 28న సంఘటనపై ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు మరియు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దోపిడీ మరియు వేధింపుల కేసు నమోదు చేయబడింది. మొదట దహిసర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును అంధేరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం అనుమానితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
-
Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు
-
Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
-
Keir Starmer: యూకే ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా..
-
Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!