Digital Arrest: 26 ఏళ్ల యువతి “డిజిటల్ అరెస్ట్”.. వీడియో కాల్లో బట్టలు విప్పాల్సి వచ్చింది..
- ‘డిజిటల్ అరెస్ట్’కి గురైన 26 ఏళ్ల యువతి..
- పోలీసుల్లా ఫోన్ చేసిన స్కామర్లు..
- బట్టలు విప్పేలా బలవంతం..
- ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ముంబైలో 26 ఏళ్ల మహిళ ఇలా ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. వీడియో కాల్ సమయంలో బట్టలు బలవంతంగా విప్పేలా చేశారు. పోలీసుల అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ స్కామ్లో రూ.1.78 లక్షలు మోసం చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 19-20 మధ్య జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అయిన మహిళకు ఢిల్లీ పోలీసులమని చెప్పుకునే వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. వ్యాపారవేత్త నరేష్ గోయల్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో యువతికి ప్రమేయం ఉందని బెదిరించారు.
Also Read
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
Read Also: Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?
స్కామర్లు అనేక నంబర్లు ఉపయోగించి, ఆమెని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వర్చువల్ ఇంటరాగేషన్ కోసం ఒక గదిని బుక్ చేయమని బలవంతం చేశారు.వీడియో కాల్ సమయంలో నిందితులు బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ కోసం రూ. 1.78 లక్షలు బదిలీ చేయమని మహిళని మోసగించారు. ఆ తర్వాత ‘‘బాడీ వెరిఫికేషన్’’ కోసం డిమాండ్ చేస్తూ, ఆమెని బట్టలు విప్పమని బలవంతం చేశారు.
బాధితురాలు నవంబర్ 28న సంఘటనపై ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు మరియు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దోపిడీ మరియు వేధింపుల కేసు నమోదు చేయబడింది. మొదట దహిసర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును అంధేరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం అనుమానితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
-
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
-
Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
-
Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!