Tamil Nadu: ‘‘ఖాకీ’’ సినిమా లాగే.. ఫామ్ హౌజ్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..
- తమిళనాడులో సంచలనంగా ఫ్యామిలీ హత్య..
- ఫామ్హౌజ్లో ముగ్గురిని చంపిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని ఓ కుటుంబంలోని ముగ్గురి హత్య ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్తీ మూవీ ‘‘ఖాకీ’’లాగే ఫామ్ హౌజ్లో ఈ హత్యలు జరిగాయి. చోరికి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుప్పూర్లోని పొంగలూర్లో కుటుంబలోని ముగ్గురు దారణహత్యకు గురయ్యారు. దైవసిగమణి, అతని భార్యఅమలతల్, వారి కుమారుడు సెంథిత్ కుమార్ శుక్రవారం ఉదయం సేమలైకవుండంపళయంలోని వారి ఫామ్హౌజ్లో శవమై కనిపించారు.
Read Also: Congress: కాంగ్రెస్లో ‘‘మహా’’ ఓటమి నిరాశ.. కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
కోయంబత్తూర్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సెంథిల్ కుమార్ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. దైవసిగమణి ఇంటికి రోజూ వచ్చే మంగలి వ్యక్తి ఈ దారుణాన్ని మొదటిసారిగా చూడటంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంటి బయట తీవ్రంగా గాయపడిన దైవసిగమణిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను చికిత్స పొందుతూ మరణించాడు. అమలతల్, సెంథిల్ కుమార్లను ఇంట్లోనే నరికి హత్య చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన తిరుప్పూర్ జిల్లా ఎస్పీ లక్ష్మి, ప్రాథమిక విచారణలో చోరీ జరిగినట్లు వెల్లడించారు. దాడిలో పదునైన, పెద్దవైన రెండు ఆయుధాలను వాడినట్లు, ఏడు సవర్ల బంగార ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. మరోవైపు వ్యక్తిగత వివాదాల కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
- Tags
- crime
- Crime News
- Robbery
- Tamil Nadu
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!