ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటీఎంలను అంతరాష్ట్ర ముఠాలు కొల్లగొట్టాయి. 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఎంలను దోచేశారు ఆగంతకులు. సుమారు 50 లక్షల రూపాయలు చోరీ అవ్వగా.... దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇదిలా ఉంటే, పంజాబ్కి చెందిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. డెహ్రాడూన్లో మంగళవారం సాయంత్రం పబ్లిక్ బస్సులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆమె మొరాదాబాద్ నుంచి వస్తుండగా మంగళవారం డెహ్రాడూన్లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్(ISBT) వద్ద ఘటన జరిగింది.
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
Bengaluru: కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటన మరవకముందే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూర్లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని బైకర్ అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.
తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. తల్లిదండ్రుల ప్రేమ ముందు సంపద, కీర్తి అన్నీ దిగదుడుపే. అయితే ఈ బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగింది
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది.
Live Location: బెంగళూర్లో ఒక మహిళ హత్య, ఆమె డెడ్బాడీని కనుగొనేందుకు పోలీసులకు ‘‘లైవ్ లొకేషన్’’ సాయపడింది. హత్యకు కొన్ని నిమిషాల ముందు సదరు మహిళ ఆమె స్నేహితురాలికి పంపిన లొకేషన్ కీలకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, లలిత అలియాస్ దివ్య తన స్నేహితురాలికి పెట్టిన లైవ్ లొకేషన్ ఆమె మృతదేహాన్ని కనుగొనేందుకు సాయపడింది. రామనగర జిల్లా మగాడి హుజగల్ కొండ అటవీ ప్రాంతలోని గోతిలో 32 ఏళ్ల బ్యూటీషియన్ని పూడ్చిపెట్టారు.
ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ భర్త తన భార్య అందంగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. భార్య అందంగా తయారవడం ఇష్టం లేని ఆ భర్త అనేక సార్లు గొడవపడేవాడు. చివరకు నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది.