Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కలిపేసుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త. ఫొటోలు మాత్రమే యువతులవి. అమ్మాయిల పేరుతో మిమ్మల్ని నిలువునా ఉంచేస్తారు కేటుగాళ్లు. గతంలో ఇదే తరహాలో మోసపోయిన బాధితుడే.. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దని అప్రమత్తం చేయాల్సిందిపోయి.. తనకు జరిగిన అన్యాయమే మరికొందరికి జరగాలని మోసాలకు పాల్పడుతున్నాడు. లక్షలు దండుకున్న కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని సూర్యరావుపేటకు చెందిన వ్యక్తి కోమలి సూర్యప్రకాష్..…
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థిని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో ఎవరికీ చెప్పవద్దని విద్యార్థిని బెదిరించాడు.
Man kills wife: కర్ణాటకలో ఘోరం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేశాడు. ఈ ఘటన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ తన భార్య 18 ఏళ్ల లిఖిత శ్రీని హత్య చేసి, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్, లిఖిత శ్రీలు ఇద్దరూ సమీప గ్రామాల నివాసితులు. ఆగస్టు 07న వీరిద్దరి వివాహం జరిగింది.
యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
iPhone: తన గర్ల్ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.