UP Shocker: అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె.. పరువు పొతుందని తల్లి, సోదరుల దారుణం..
- అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె..
- కుటుంబ పరువు పోతుందని తల్లి.. సోదరుల దారుణం..
- ప్లాన్ చేసి తుపాకీతో కాల్చి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: PM Modi US Visit : యూఎస్లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
సెప్టెంబర్ 18న బాలిక తన సోదరుడు, తల్లితో కలిసి మోటార్ సైకిల్పై వెళుతుండగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రింకూ(20) అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని, ఫిబ్రవరిలో అతడిపై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెలలో రింకూకు బెయిల్ వచ్చింది. తమ కూతురిని రింకూనే తన సహచరులతో కలిసి పగతీర్చుకునేందుకు చంపాడని బాలిక కుటుంబం ఆరోపించింది. దీంతో పోలీసులు రింకూని, అతడి సహచరులని అరెస్ట్ చేశారు.
అయితే, వీరిని విచారించిన నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో, బాలిక తల్లి ఆమె ఇద్దరు సోదరులు ఆమెను చంపడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. బాలిక సోదరుడు వినీత్ తన మామ మహావీర్తో కలిసి తన సోదరి, సోదరుడు నీరజ్, తల్లి బ్రిజ్వతితో కలిసి మోటార్ సైకిల్పై తీసుకెళ్లి ప్లాన్ చేసి చంపారు. ప్రస్తుతం మహావీర్ పరారీలో ఉండగా, నీరజ్, వినీత్, బ్రిజ్బతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన దేశీ తుపాకీని, మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ సాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!