రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్లో కరౌలీ జిల్లాలో జరిగింది.
మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు.
మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా ఆ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ ఘటనతో ఉలిక్కి పడింది.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు అమలు చేస్తున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారాలు చెయ్యడం ఒక ఎత్తు అయితే హత్యలు చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు.. ఇటీవల ఢిల్లీలో శ్రద్దా కేసు జనాలను వణికించింది.. ఇప్పుడు అదే తరహాలో మరో కేసు వెలుగు చూసింది.. ఓ మహిళను అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో…
రాజస్థాన్లో సినీ ఫక్కీలో ఓ నిందితుడి హత్య జరిగింది. చాలా సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం. నిందితుడు ఓ కేసులో ఇరుక్కుంటే.. అతడి వల్ల వారు పట్టుబడుతారేమోనని పోలీసుల ఎదుటే చంపేస్తారు. అలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్లో జరిగింది.
బెంగళూరులో మంగళవారం జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ల జంట హత్యలు జరిగిన ఒక రోజు తర్వాత, ప్రధాన నిందితులు సహా ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దేశంలో టమోటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. టమోటాల వాడకాన్ని చాలా వరకు తగ్గించారు..ఇక కొందరు గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది.. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే రేట్లు ఎలా ఉన్నాయో అర్థం…