Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో భార్యభర్తల గొడవ కొడుకును నేరస్తుడిగా మార్చింది. తన తల్లిని బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడనే కోపంతో తండ్రిని హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని పాలము జిల్లాలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తుపాకీ చోరీ కలకలం రేపుతుంది. 30 రౌండ్లతో కూడిన ఇన్సాస్ 60 వెపన్ చోరీ అయింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు చెందిన ఇన్సాస్ 60 వెపన్ మాయం అయిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
Hyderabad: బ్రతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు తిన్నాయని.. భర్తతో గొడవపడి బయటకి వస్తే మహిళని మాటల్లో పెట్టి బంగారం మాయం చేశారు మరో ఇద్దరు మహిళలు.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మధురానగర్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13వ తేదీన తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాగా ఆ మహిళను గమనించిన మరో ఇద్దరు మహిళలు…
Illicit Relationship: సభ్య సమాజం తలదించుకునేలా, ఇలా కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని నోరెళ్ల పెట్టేలా ఓ వ్యక్తి, ఓ మహిళ అనైతిక సంబంధం పెట్టుకున్నారు. ఏకంగా కూతురి అత్తగారితో లవ్ లో పడ్డాడు ఓ వ్యక్తి. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో తనువు చాలించారు. నడి వయస్కులైన ఈ జంట చివరకు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
Kerala: గతేడాది ఏప్రిల్లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.