Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Minor Girl Case: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో చోటుచేసుకున్న చిన్నారి దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. అనంతరం నిందితుడు చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు పోస్టుమార్టం ద్వారా తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఘటనపై స్పందించిన డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇక, చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అధికారులు, కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
- Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు నిందితులకు బెయిల్..
ఇక, మదనపల్లెలో చిన్నారి హత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు.. నిందితుడ్ని తమకు అప్పగించాలని.. లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. అయితే, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై-ముంబై హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని.. కేసులో కచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాథ్ వివరించారు.. కానీ స్థానికులు ఆందోళన విరమించడం లేదు… చివరకు పోలీసులు అర్థం చేయించడంతో వెనక్కి తగ్గారు.. ఆ తర్వాత పోస్టుమార్టం పూర్తి చేశారు..
మరోవైపు, మదనపల్లె ఏడేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మదనపల్లి ఘటనపై విచారణం వ్యక్తం చేసిన ఆయన.. చిన్నారి రిషిక తల్లిదండ్రులతో మాట్లాడారు.. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు… కఠిన శిక్ష పడేలా చూస్తానన్న హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇది చాలా బాధాకరమన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడానని.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. హత్యాచారానికి పాల్పడిన వ్యక్తి డ్రగ్స్, గంజాయి సేవించలేదని.. అతిగా మద్యం తాగాడని పేర్కొన్నారు. స్థానికులు నిందితుడ్ని తమకు అప్పగించాలని ఆందోళన చేశారని.. కానీ చట్టప్రకారం వెళ్లాలి కాబట్టి అతడ్ని పోలీసు స్టేషన్కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుందని అనిత స్పష్టం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు చేసి జైలుకు పంపిస్తామని.. అతడ్ని బయటకు రాకుండా చూసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు హోంమంత్రి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!