Unfathomable Tragedy: విషాదం.. పుట్టినరోజున చాక్లెట్లు పంచి అంతలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unfathomable Tragedy: ఆ చిన్నారి ఉదయాన్నే నిద్ర లేచింది. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యుల తీసుకుంది. పాఠశాలకు వెళ్లి అందరికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టితల్లికి తెలియదు.. పుట్టిన రోజే తనకు ఆఖరి రోజు అవుతుందని. పుట్టిన రోజున ఆనందంగా గడిపిన ఆ చిన్నారి విషాదకర రీతిలో మృతి చెందింది. తరగతి గదిలో నాపరాయి మీద పడడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంతకల్లులో అంకాలమ్మ వీధిలో నివసిస్తున్న శిరీష, రంగా దంపతుల కూతురు కీర్తన(4) స్థానికంగా శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం పుట్టినరోజు కావడంతో ఆనందంగా పాఠశాలకు వచ్చింది. తోటి చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందంగా గడిపింది. ఆ తర్వాత అలసిపోయి తరగతి గదిలోనే సేదతీరింది. చిన్నారి పడుకున్న ఉన్న సమయంలో నాపరాయి మీద పడడంతో తీవ్రగాయాల పాలైంది. రక్తమోడుతున్న చిన్నారిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: Viral Couple Apology: సీపీ సీవీ ఆనంద్ను కలిసి క్షమాపణలు చెప్పిన పోలీసు జంట
Also Read
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
అప్పటిదాకా ఆనందంగా గడిపిన తమ చిన్నారిని విగతజీవిగా చూసి కీర్తన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అది అక్కడున్న వారందరినీ కదిలించింది. పుట్టినరోజు నాడే చిన్నారి మృతి చెందడంతో ఆ పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. పాఠశాల నిర్వాహకుల వల్లే తమ చిన్నారి మృతిచెందిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. చిన్నారి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!