LJP Leader: బీహార్లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్ను పట్టపగలు బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అన్వర్ ఖాన్ పశుపతి కుమార్ పరాస్ వర్గానికి చెందిన నాయకుడు.బుధవారం నాడు ఎల్జేపీ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ ఖాన్ సెలూన్లో ఉండగా బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురి చేసింది. అది చూసిన ప్రజలు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు తమ దుకాణాలను మూసివేశారు.ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు, అన్వర్ ఖాన్ కుటుంబ సభ్యులు 82వ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాన్ని పంపారు. దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.