Jewellery Shop: జ్వువెలరీ షోరూం గోడకు కన్నం వేసి.. రూ. 25 కోట్లు నగలు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thieves Drill hole into Wall of jewellery Shop in Delhi దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్పురాలోని భోగల్లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చాలా సేపు పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం పైకప్పుకు, గోడకు రంధ్రాలు చేసి స్ట్రాంగ్రూమ్లోకి దొంగ ప్రవేశించినట్లు తెలిసింది. ఆ జ్యువెలరీ షాప్లో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ చేయడానికి ముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్రూమ్కు రంధ్రం చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఆదివారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు భావిస్తున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు.
Also Read: Warangal: మెట్ల బావిలో బయటపడిన పురాతన శివలింగం
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
నాలుగు అంతస్తులు ఉన్న ఆ భవనంలోకి పై అంతస్తు నుంచి దొంగలు చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న స్ట్రాంగ్రూమ్ను దొంగలు పగలగొట్టారు. స్ట్రాంగ్రూమ్లోకి ప్రవేశించేందుకు దొంగలు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. లాకర్లో ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్ డిస్ప్లేలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న నిజాముద్దీన్ పోలీస్స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆదివారం అర్థరాత్రి జువెలరీ షోరూంలో దొంగలు చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. జ్యువెలరీ షోరూంలోని ఫుటేజీని, సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను స్కాన్ చేయడమే కాకుండా, సమీపంలోని వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దొంగతనం కేసు నమోదు చేసి, దర్యాప్తులో నిమగ్నమైన ఢిల్లీ పోలీసు బృందం సోమవారం నగల షోరూమ్కు సెలవు అని చెప్పారు. మంగళవారం ఉదయం షోరూమ్ను ప్రారంభించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Armenia: ఆర్మేనియా గ్యాస్ స్టేషన్లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు…
షోరూం యజమాని సంజీవ్ జైన్ మాట్లాడుతూ.. ఆదివారం షాపు మూసేశామని, సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచి చూడగా షాపు మొత్తం దుమ్ము, స్ట్రాంగ్ రూం గోడకు రంధ్రం పడి ఉందని తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారు. దాదాపు రూ.20-25 కోట్ల విలువైన ఆభరణాలను దుకాణంలో ఉంచారు. దొంగలు దుకాణం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించారు. షోరూం పైకప్పు, గోడ పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు సులువుగా చోరీకి పాల్పడ్డారని జైన్ తెలిపారు. సీసీటీవీ సహా అన్నీ ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీసులు జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని కూడా విచారించారు, త్వరలో ఆధారాలు దొరుకుతాయని పేర్కొన్నారు
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!