Jagtial Murder: జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Murder: అది జగిత్యాల పట్టణం. ఓ వైపు శివరాత్రి.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక హడావుడి. పట్టణంలో ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం ఉంది. ఈ సందట్లో.. నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా ఓ యువకున్ని చంపేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాలలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బోరే విశ్వనాథ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. విశ్వనాథ్పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన బోరే విశ్వనాథ్కు జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన వివాహితతో ఇన్స్టాగ్రాంలో పరిచయమైంది. ఆమె భర్త గల్ఫ్లో ఉండగా సోషల్ మీడియా పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో విశ్వనాథ్ 4 నెలల క్రితం జగిత్యాలలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని మహిళతో సహజీవనం చేస్తున్నాడు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన భర్త.. పిల్లల కోసం భార్యను పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించాడు. తాను తిరిగి భర్త వద్దకు రానని ఆ మహిళ తెగించి చెప్పేసింది.
భార్య చెప్పిన మాటకు భర్త గంగాధర్ షాకయ్యాడు. కానీ తల్లి లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతుండడంతో తల్లడిల్లిపోయాడు. అంతే.. తన భార్యను తీసుకు వెళ్లిన విశ్వనాథ్పై కోపం పెంచుకున్నాడు. శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్.. సహజీవనం చేస్తున్న మహిళతో బైక్పై సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న జాతరకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జగిత్యాలలో వారి కోసం కాపు కాశారు. విశ్వనాథ్ జగిత్యాల బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో విశ్వనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితుల్లో.. ఓ వ్యక్తి ఆ మహిళ తన భార్య అని చెప్పి.. విశ్వనాథ్తో కలిసి ఉంటోందని అన్నాడు. అందుకే హతమార్చానని చెప్పి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విశ్వనాథ్ తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు గంగాధర్తో నాలుగు నెలల క్రితమే విడాకులు అయ్యాయని మహిళ చెబుతోంది. అంతే కాదు గంగాధర్ వేరే పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను విశ్వనాథ్ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కానీ ఇలా తన భర్తను చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మొత్తానికి వివాహేతర బంధం కారణంగా .. విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తోంది.
READ ALSO: Peddi: ‘పెద్ది’ కెప్టెన్కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?