ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. ఈ సీజన్ తనకు చివరిదని, తర్వాత సీజన్లు ఆడడంటూ ప్రచారం కొనసాగుతుంది. అందుకోసమే గ్రౌండ్ లో ఫ్యాన్స్ ను ఉత్సహపరిచేందుకే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడని కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే.. ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్స్ ధోనీ, తర్వాత సీజన్లు ఆడుతాడని జోస్యం చెప్పారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును…