Suryakumar Yadav: ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?.. ఫైనల్ ముందు సూరీడు ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్
- ఫైనల్ ముందు సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav on Pressure Before IND vs NZ T20 World Cup 2026 Final: భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్కు ముందు జట్టు సిద్ధత, వ్యూహాలు, ప్లేయింగ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్పై ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. సన్నద్ధత సమయంలోనే ఒత్తిడిని అనుభవిస్తే మ్యాచ్లో ఇబ్బంది ఉండదని, ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది? అని అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే.. ఒత్తిడిని జయించడం అంత సులువు అవుతుందని సూరీడు చెప్పుకొచ్చాడు.
ఫైనల్ మ్యాచ్లోనూ జట్టు నాణ్యమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తుందని సూర్యకుమార్ తెలిపాడు. ‘మేము 250 పరుగులు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ ముందుగా అలాంటి లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికలు చేయడం లేదు. పిచ్ పరిస్థితులను బట్టి ఆటలో మార్పులు చేసుకుంటాం. నేను, జట్టు సభ్యులు, కోచింగ్ స్టాఫ్, అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత ఆరేళ్లుగా నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లో భారత జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సూర్యకుమార్ తెలిపాడు.
Also Read
- AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- Vaibhav Sooryavanshi: "ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి".. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు
- Praggnanandhaa - Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు 'ప్రజ్ఞానంద' చెక్మేట్.!
ఐసీసీ ఫైనల్ మ్యాచ్ల్లో ఒత్తిడి గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఒత్తిడిని అంత సులభంగా జయించగలం. సన్నద్ధత సమయంలోనే ఒత్తిడిని అనుభవిస్తే మ్యాచ్ సమయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అసలు ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?’ అని నవ్వుతూ చెప్పాడు. ‘జట్టులోని ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం ఉంది. జట్టులో అందరం ఒక కుటుంబంలా ఉంటాం. పరస్పరం మాట్లాడుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం’ అని సూర్య పేర్కొన్నాడు.
జట్టు తుది ఎంపికపై సూర్యకుమార్ యాదవ్ తన అభిప్రాయం వెల్లడించాడు. ‘ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఎప్పుడూ కఠినమైన నిర్ణయమే. ప్రధాన కోచ్తో కలిసి పరిస్థితులను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటాం. జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ద్వైపాక్షిక సిరీస్లలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలతో కూడిన కూర్పు బాగా వర్కౌట్ అయింది. అందుకే సంజుకు అవకాశం ఇచ్చాం. సంజు రాకతో అంతా మారిపోయింది. అతను చేసిన కష్టానికి ఇదే సరైన గుర్తింపు’ అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మరికొన్ని గంటల్లో భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..