ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు..…
విద్యార్థులకు శుభవార్త.. రేపే ఆ మొత్తం ఖాతాల్లో జమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. రేపు జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు.. అయితే, ఇప్పుటికే రెండో సార్లు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన వాయిదా పడింది.. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో,…
రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ఎండల ఎఫెక్ట్ అలా ఉంది మరి..! రాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. .కానీ, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఉపసమనం కోసం వైన్ షాపులకు పరిగెడుతున్నారు మందుబాబులు. బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొండుతున్నారు. ఫలితంగా మద్య అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పక్షం రోజుల్లో 35 లక్షల కాటన్లు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగాయి. 18…
నెరవేరనున్న దశాబ్దాల కల.. బందర్పోర్టుకు నేడే శంకుస్థాపన కృష్ణా జిల్లా వాసుల దశాబ్దల కల నెరవేరనుంది. సుదీర్ఘ కాలం తర్వాత బందరు పోర్టు శంకుస్థాపనకు నోచుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బందరు పోర్టుకు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బందరుకు హెలికాప్టర్ లో బయలుదేరతారు. తాపసిపుడి హెలిపాడ్ దగ్గర దిగి.. 9 గంటల 10 నిమిషాలకు పోర్ట్ దగ్గర భూమి పూజలో జగన్ పాల్గొంటారు. తర్వాత పైలాన్ను ఆవిష్కరిస్తారు.…
పవన్ డెడ్లైన్..! మరో నెల రోజులు వెయిట్ చేస్తాం..! అన్నమయ్య డ్యాం బాధితుల ఇళ్ల నిర్మాణంపై పోరాటం విషయంలో జనసేన పార్టీ మరో నెల రోజుల పాటు వెయిట్ చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అన్నమయ్య డ్యాం బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం చేస్తామంటూ అధికారులు చేసిన ప్రకటన పై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.. అన్నమయ డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డా ఆయన.. అధికారులవి కంటితుడుపు చర్యలేనని భావిస్తున్నాను.. అధికారులు…
ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు..! ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. వడగాలులు వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయి.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక, ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు…
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి.. ఎండలు.. వానలు.. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. అయితే నిన్న కొన్ని జిల్లాల్లో వర్షం కురియడంతో జనం కాస్త సేద దీరారు. నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టగా… తర్వాత చిరు జల్లులు కురిశాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈదురు గాలుల వాన భీబత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 66వ గేమ్లో భాగంగా శుక్రవారం (మే 19) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.