ఏవైనా స్పెషల్ డేస్ వస్తే రోహిత్ శర్మకు ఊపు వస్తుందని మరోసారి రుజువైంది. దీపావళి పండగకు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. దీపావళి అంటే చాలు రోహిత్ రెచ్చిపోతున్నాడు. దీపావళి సందర్భంగా ఆరోజు లేదా అంతకుముందు రోజు జరిగే మ్యాచ్లలో రోహిత్ విశ్వరూపం చూపిస్తున్నాడు. Read Also: టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత్ 2013లో దీపావళి సమయంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. 2016లో న్యూజిలాండ్తో జరిగిన…
టీ20 ప్రపంచకప్లో ఎట్టకేలకు టీమిండియా ఖాతా తెరిచింది. బుధవారం రాత్రి అఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వరుసగా మూడోసారి భారత కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఈ ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Read Also: దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్ ముందు భారీ…
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్ను టీమ్ ఇండియా హెడ్ కోచ్గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్…
ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా…
టీ20 ప్రపంచకప్లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ…
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ పాకిస్థాన్ విజయానికి గట్టి పునాది పడింది. అబుదాబీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఓపెనర్ రిజ్వాన్ను అంపైర్ ఎల్బీగా అవుట్ చేయగా రివ్యూ తీసుకున్న పాకిస్థాన్ విజయవంతమైంది. అనంతరం ఓపెనర్లు రిజ్వాన్ (79 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (70) తొలి వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. 14.2 ఓవర్ల వద్ద పాక్…
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్ సింగ్ అంటే నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్, 2007 ప్రపంచకప్లో ఆరు సిక్సర్లు గుర్తుకురాక మానవు. ఆయా మ్యాచ్లలో యువీ అంతటి గొప్ప ముద్ర వేశాడు. అయితే మంగళవారం నాడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ తనను మైదానంలో చూస్తారని హింట్ ఇచ్చాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ మళ్లీ తనను ఫీల్డ్లో చూస్తారని…
టీ20 ప్రపంచకప్లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది.…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జట్ల కంటే ముందుగా దుబాయ్ చేరుకుని ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం ద్వారా పిచ్లపై అవగాహన ఉన్న టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఆడుతున్నారని పలువురు క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. పటిష్టమైన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ప్రణాళిక ప్రకారం ఆడకుండా కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీమిండియాకు సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారినా.. పూర్తిగా అయితే దారులు మూసుకుపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే…
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-2లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు…