దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు అధికారులు చోటు కల్పించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. Read Also: ఐపీఎల్ ఆటగాళ్ల…
ఐపీఎల్ 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా వేలానికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ నిర్వహించనుంది. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. Read Also: స్వదేశంలో భారత్ను ఓడించే…
స్వదేశంలో భారత్ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ అన్నారు. ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు నేడు భారత్కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు…
త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్, కోల్కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది. Read Also: ఐపీఎల్-15కు…
ఫిబ్రవరి తొలివారంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్కు విభేదాలు తలెత్తాయి. ఆల్రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెస్టిండీస్ జట్టులో లుకలుకలు బహిర్గతం అయ్యాయని విండీస్ మీడియాలో…
క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్లో…
జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్కు రెండు ప్రపంచకప్లు కూడా అందించాడు. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి జట్టులోనూ ధోనీ లాంటోడు ఒకడు ఉండాలన్నాడు. సహజ వాతావరణంలో క్రికెట్ నేర్చుకున్న వాళ్లే ఎక్కువ కాలం క్రికెట్ ఆడగలుగుతారని.. అలాంటి వాళ్లలో ధోనీ ఒకడని కితాబినిచ్చాడు. Read Also: వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లకు భారతజట్టు…
స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్గా లేని కారణంగా హార్డిక్…
దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన టీమిండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానెలు జట్టులో స్థానానికే ఎసరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి కాంట్రాక్ట్కు బీసీసీఐ డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగనుంది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులను బీసీసీఐ సిద్ధం చేస్తోంది. త్వరలోనే…