భారత దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యపించింది. ప్రపంచంలోని 53 దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. ఇండియాలో ఈ డబుల్ మ్యూటేషన్ వేరింట్ కారణంగా పాజిటీవ్ కేసులు, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వేరియంట్ చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు. జూన్ నుంచి ఈ…
కరోనా సమయంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కేరళ వైద్యులు నదిని, అడవులను దాటుకోని వెళ్లారు. నలుగురు వైద్యబృందం ఈ సాహసం చేసింది. కేరళలోని డామిసిలియరీ కేర్ సెంటర్కు మురుగుల అనే మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది. 100 మంది నివశించే ఆ గ్రామంలో కొంత మంది కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని ఫోన్ రావడంతో వెంటనే ముగ్గురు వైద్యులు కారులో బయలుదేరారు. కారు పుఝా…
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా…
గ్రేటర్ హైదరాబాద్లో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధులు దాటాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పాసులు లేని వారిని కమిషనరేట్ సరిహద్దులు దాటనివ్వడం లేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఏ కమిషనరేట్లో లిమిట్ దాటాలన్నా పాసులు ఉండాలని, అత్యవసర సర్వీసులు, ఎసెన్సియల్ సర్వీసుల వారికి మాత్రమే పాసులు లేకుండా అనుమతులు ఉంటాయని పోలీసులు స్ఫష్టం చేస్తున్నారు.…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నాక అనేక దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిబందనలు పాటించకపోవడంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ సీషెల్స్. 98 వేల మంది జనాభా కలిగిన ఈ దేశంలో 61.4 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ను అందించారు.…
కరోనా మహామ్మారిని ఎదుర్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మెడిసిన్ ఇప్పుడు సంచటనంగా మారగా, తెలంగాణలో మంథనీకి చెందిన గోశాల నిర్వాహకులు రమేష్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో తిరిగే అవుల నుంచి సేకరించిన ఆవుపేడ పిడకలు, నెయ్యి, ఆవాలు, కర్పూరం, పసుపు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పోగను గదిలో వేయడం వలన గదిలో ఉన్న కరోనా వైరస్ చనిపోతుందని, గాలిలో ప్రాణవాయువు పెరుగుతుందని…
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని నిపుణులు ముందస్తుగా హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాలు ఆ ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పిల్లలపై ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్…
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలి అంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో, తీసుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం ఆరగంటసేపు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వలన ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. వ్యాక్సినేషన్కు ముందు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వ్యాక్సినేషన్ వలన సైడ్ ఎఫెక్టులు ఎక్కువకాలం ఉంటాయి కాబట్టి ఎలాంటి…
పుదుచ్చేరిలో కరోనా కేసుల దృష్ట్యా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో మే 24 వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నా కేసులు తగ్గకపోవడంతో పుదుచ్చేరిలో లాక్డౌన్ ను మరోసారి పొడిగిస్తున్నట్టు లెఫ్ట్నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ప్రకటించారు. కరోనా రెండోదశ నియంత్రణ చర్యల్లో భాగంగా సడలింపులతో కూడిన లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. మే 31 వ తేదీ వరకు…
అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ను వేగవంతంగా అందిస్తున్నారు. దీంతో అమెరికాలో కేసులు తగ్గుముఖంపట్టాయి. ఇక ఇదిలా ఉంటే, వైట్హౌస్లో చాలా కాలం తరువాత అధికారులు మాస్క్ లు లేకుండా తిరుగుతూ కనిపించారు. అటు అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్తో సహా అందరూ మాస్క్ లను పక్కన పెట్టి కరచాలనం, ఆలింగనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఆరడుగుల దూరం పక్కనపెట్టి మునుపటి మాదిరిగా ఒకరికోకరు…