రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లి లో వడ్డెర బస్తీలో కూల్చిన ఇళ్ళను పరిశీలించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, దివంగత పి.జనార్థన్ రెడ్డిని తలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించారు ఆయనే వుండి వుంటే.. పేదల ఇళ్ళను కూల్చే ధైర్యం ఎవరికైనా వుండేదా అని అన్నారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు రేవంత్…
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని…
రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. రోశయ్య మరణం మాకు బాధాకరం.. ఆయన మరణం పట్ల మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. ఆయన పదవులకోసం ఏనాడు పాకూలాడలేడు. పార్టీ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తి. నేను,రోశయ్య, గీతారెడ్డి సహచర మంత్రులుగా పనిచేసాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం అని గుర్తుచేసుకున్నారు. ఇక పార్టీ,ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేసాం. ఆర్థిక శాఖలో ఎంతో పట్టున్న వ్యక్తి. ముఖ్యమంత్రి గా గవర్నర్ గా ఎన్నో…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం గవర్నర్ కి చెప్పాం అని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్రంది అని చెప్పిన ఆయన పంటను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అని అన్నారు.. మెడ మీద కత్తి పెడితే రాష్ట్రాన్ని మోడీకి రసిస్తడా.. కేసీఆర్ అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు అదానీ..అంబానీకి రాష్ట్రాన్ని అమ్మేస్తడా అని అడిగారు. రైతును అయోమయంలోకి నెట్టి… తక్కువ ధరకు అమ్మే పరిస్థితి…
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్లైట్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ నేత రోడ్లను ఓ బాలీవుడ్ హీరోయిన్తో పోల్చారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ రెండు రోజుల కిందట క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఈ సందర్భంగా…
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే..…
ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత 15మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పతనం మొదలైందని, చాలా మంది నేతలు టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. గాంధీ భవన్లోకి గాడ్సే…
దాడులకు, కేసులకు కాంగ్రెస్ భయపడదు అని మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం.. కాంగ్రెస్ కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు రక్షణ కల్పించేందుకు కాల్ సెంటర్ పెడుతున్నాం అని తెలిపారు. న్యాయ సలహాలు అందిస్తాం.. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంభం పాలన చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి పాలించే హక్కు లేకుండా పోయింది.…
బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు… పవర్ అంతా.. ఢిల్లీ చేతిలోనే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస.. బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. గల్లీలో బండి సంజయ్ సీఎం నీ గల్లీలో బండ బూతులు తిడతారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు.. బండి సంజయ్ ఇప్పటికీ సీఎంని జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారు అని తెలిపారు. పులి.. మేక ఆటలో బండి సంజయ్ బలి అయిపోతారు.…
మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆయన కీలక నేత. ఒకానొక సమయంలో సీఎం రేస్ వరకు వెళ్లారు. రాజకీయాలంటే బోర్ కొట్టిందో ఏమో సైలెంట్గా ఉండిపోయారు. ఒక సామాన్యుడిలా మారిన ఆయన జీవనశైలిని చూసి ఆశ్చర్యపోయారు జనం. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మరి.. ఇకనైనా అజ్ఞాతం వీడతారా? ఎవరా నాయకుడు? రెండున్నరేళ్లుగా నీలకంఠాపురంలోనే రఘువీరారెడ్డి! మెరిసిన గడ్డంతో.. సామాన్య రైతులా కనిపిస్తున్న ఈయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో…