రేవంత్ నోట పీజేఆర్ మాట… ఆయనే వుండి వుంటే..?
రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లి లో వడ్డెర బస్తీలో కూల్చిన ఇళ్ళను పరిశీలించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, దివంగత పి.జనార్థన్ రెడ్డిని తలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించారు ఆయనే వుండి వుంటే.. పేదల ఇళ్ళను కూల్చే ధైర్యం ఎవరికైనా వుండేదా అని అన్నారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణలో పీజేఆర్ లేని లోటు కనిపిస్తోందన్నారు రేవంత్.
క్రిస్మస్ పండగ రోజున పేదల కళ్ళలో నీళ్ళు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బసవతారక నగర్ లో పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయిన వారు ఇప్పుడు ఆ సంగతి మరిచారు. మొన్న బుధవారం తల్లిదండ్రులు పనులకు పోయినప్పుడు.. పిల్లలు బడులకు పోయినప్పుడు వచ్చి ఇక్కడ గుడిసెలు కూల్చారు. ఇక్కడ ఉన్న వడ్డెర సోదరులు తమ కండలు కరగదిస్తేనే ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు వచ్చాయన్నారు రేవంత్.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ప్రభుత్వం కక్ష సాధింపుతో వీరిని అనాథలుగా చేసిందని మండిపడ్డారు. కూల్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అన్నారు. 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న వారిని వారు కోరుకుంటున్న విధంగా 60 గజాల భూమి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని డిమాండ్ చేశారు.
వీళ్ళకి పట్టాలివ్వకుంటే..పట్టాలు వచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వీరందరికీ వంటా వార్పు చేస్తాం అన్నారు. కూల్చిన ఇంటిలోనే ఆడబిడ్డ ప్రసవం జరిగింది..తక్షణమే మున్సిపల్ మంత్రి ఇక్కడికి రావాలన్నారు. స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు 1000 మంది బాధ్యత మున్సిపల్ మంత్రి కేటీఆర్ దే అన్నారు రేవంత్ రెడ్డి. తక్షణమే వారు ఇక్కడికి వచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వీరికి అండగా ఉంటుంది. అధికారులతో ,మున్సిపల్, జోనల్ కమిషనర్ లతో మాట్లాడానన్నారు. కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పట్టాలు ఇవ్వడానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో