1. నేటి నుంచి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనుంది. అయితే ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నిర్వహించనున్నారు. 2. నేడు పోలవరం ప్రాజెక్టను కేంద్ర జలశక్తి అధికారులు సందర్శించనున్నారు. పనుల పురోగతిని శ్రీరామ్ వెదిరె, చంద్రశేఖర్ అయ్యంలు పరిశీలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టు పనులను అధికారుల బృందం పరిశీలించనుంది. 3. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
దేశంలో విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యావిధానం పూర్తిగా ఏక పక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదించలేదని అన్నారు. తెలంగాణలో విద్యా విధానాన్ని మార్పు చేస్తామని అన్నారు. దేశంలో సెన్సేషన్ జరగాలి… జరుగుతుంది అని కేసీఆర్ అన్నారు. రాబోయే…
కష్టం, శ్రమ మనది.. కేసీఆర్ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్,…
1. నేడు, రేపు హైదరాబాద్లో 34 ఎంఎంటీఎస్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వారాంతంలో ప్రయాణికులు లేని కారణంగా వరుసగా రెండో వారం కూడా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను రద్దు చేసింది. 2. నేడు మోడీ పర్యటనపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. పార్టీ నేతలతో బండి సంజయ్, కిషన్రెడ్డిలు సమావేశంకానున్నారు. 3. నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతుం జాతీయ పర్యటనలో ఉన్నారు. 4.…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2014 జూన్ 2 ఏర్పడ్డ తెలంగాణ 2022లో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అవతరణ వేడుకలకు సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిచనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జిల్లాల వారీగా అవతరణ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథులను…
పోలీస్ ఉద్యోగాలే టార్గెట్ గా కష్టపడుతున్న వారికి, తమకు వయో పరిమితి దాటిందని బాధపడుతున్ననిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇటీవల తెలంగాణ సర్కార్ 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు తగ్గట్లుగానే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే కోవిడ్ వల్ల, నోటిఫికేషన్ ఆలస్యం…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక…
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు,…
తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం…