ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2022 కి భారీ ఎత్తున తరలివచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీడీపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ తీర్మానంలో…
వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో వాతావరణం మరింతగా వేడెక్కింది. బస్సు యాత్ర పై చంద్రబాబు విషం కక్కుతున్నాడు. ప్రజలు రాజకీయ సమాధి కడతారు. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబు కు సిగ్గు ఉండాలి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, మహానాడు తీరుపై నిప్పులు…
ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర.…
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్తో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆదిత్య మిట్టల్ అంగీకరించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవల గ్రీన్ కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్…
ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబులెన్సులు ఉండవు… సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు కుట్లు వేసి కట్లు కడతారని చెప్పాల్సింది. కోవిడ్ కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి? వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు పవన్. ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందంటూ దావోస్ వేదికగా జగన్ చెప్పిన మాటలను ప్రజలు…
వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా…
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై…
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l — YSR Congress Party (@YSRCParty) May 23, 2022…
ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి…