Somu Veerraju: ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమే.. దమ్ముంటే చర్చకు వస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి నూతన విగ్రహాన్ని ప్రతిష్టింప చేసిన ఘనత బీజేపీదే అన్నారు.
Read Also: Karnataka: కారులో నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనం..
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం… కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయాణిస్తున్నారని విమర్శించారు సోము వీర్రాజు.. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించిందన్న ఆయన.. పేదలకు పంచే రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు రూపాయలు పెడితే, బీజేపీ 30 రూపాయలు పెడుతుందని.. అసలు, రెండు రూపాయలు వాటా పెట్టి బియ్యం పంపిణీ చేయడానికి వాహనం అవసరమా..?, ఆ వాహనంపై సీఎం జగన్ ఫోటో ఎలా వేసుకుంటారు..? అని ప్రశ్నించారు.
40 సంవత్సరాల ఉత్తరాంధ్ర ప్రజల కల విశాఖ రైల్వే జోన్… అది నెరవేర్చింది ప్రధాని నరెంద్ర మోడీయేనని ప్రశంసలు కురిపించారు సోము వీర్రాజు.. రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది కేంద్ర ప్రభుత్వం, దమ్ముంటే మంత్రి బొత్స దీనిపై చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు.. కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది మోడీ ప్రభుత్వమన్న ఆయన.. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు.. అటువంటిది వచ్చే ఎన్నికల్లో గెలిచే అర్హత బీజేపీకి తప్ప ఇంకే పార్టీకి ఉంటుంది..? అని ప్రశ్నించారు. ఇక, వైసీపీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యాకర్తలందరూ పనిచేసేందుకు శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!