Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు.
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
విశాఖను మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో ఉన్నారని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నాని వివరించారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారని ఆయన తెలిపారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నారని.. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.

మరోవైపు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో సీఎం జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడుల విషయంపై వివరించారు. మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై సీఎం జగన్తో స్విస్ పార్లమెంట్ ప్రతినిధి బృందం చర్చించింది.
స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ.
భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశం.
ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన బృందం.#CMYSJaganInDavos #APatWEF22 #AndhraPradesh pic.twitter.com/9b0VJoewvL— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
మరోవైపు ఓఎస్కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తకీషి హషిమొటోతో మాట్లాడుతూ.. షిప్పింగ్, లాజిస్టిక్స్ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించామన్నారు. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయని.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి తమకూ అవకాశం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. తాము భారత్లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టామని.. ఏపీలో ఈ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉందని.. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని తకీషి హషిమొటో వివరించారు.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!