Mahanadu 2022: మహానాడులో నాలుగు తీర్మానాలు
ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది.
కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. 45 లక్షల ఎకరాల పంటల సాగు ఉంటే కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. పెట్రో ధరల భారం కారణంగా రైతుల పైనా తీవ్ర భారం పడుతుంది. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
తెలంగాణ రైతులకు మీటర్ల పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నాడు. టీడీపీ హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయి. రాయల సీమలో ఉండే డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారు. ఒక్క రూపాయి రైతులకు డ్రిప్ సబ్సిడీ కింద ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమయ్యింది..? ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే రూ. 1000-1100కు ధాన్యం ఎందుకు అమ్ముకుంటారు..? స్వయంగా వైసీపీ ఎంపీనే ధాన్యం రైతులకు జరుగుతున్న అన్యాయంపై చెప్పింది వాస్తవం కాదా..?
రైతుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వైసీపీ ఖర్చు చేయలేదన్నారు నరేంద్ర. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై తీర్మానం ప్రవేశపెట్టారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. దళిత నియోజకవర్గంలో ఉన్న అమరావతిపై కుల ముద్ర వేశారు. అమరావతి నిర్మాణం ఆపేస్తే రాష్ట్రానికి.. దళిత, బడుగులకు నష్టం. ఆరు దళిత నియోజకవర్గావ మధ్యలో అమరావతి ఉందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. అత్యంత కీలక ప్రాజెక్టులైన అమరావతి-పోలవరం పూర్తి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో