ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ మహానాడు, చంద్రబాబు తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు.
వైసీపీ మంత్రులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ రెడ్డి, నేతలు, పార్టీ శ్రేణులు. బస్సు యాత్ర సందర్భంగా కిక్కిరిసింది నర్సరావుపేట. రాష్ట్రంలో సామాజిక న్యాయభేరీ యాత్ర చేసే హక్కు మాకే వుందన్నారు వైసీపీ మంత్రులు. నేల ఈనిందా? మహానాడు వేదిక పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదు. అచ్చెన్నాయుడుకు సిగ్గు లేదా? బీసీలకు చంద్రబాబు…
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదు.ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారు.మనకు జనాలు ఉన్నారు.. వారికి బస్సులున్నాయి.అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. మహానాడు వాహానాలకు గాలి తీసేస్తున్నారు.ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.జగనుకు ఈ రోజు పిచ్చెక్కుతుంది.జగనుకు ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ…
టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని…
ఒంగోలులో టీడీపీ మహానాడు బహిరంగ సభ ప్రారంభం అయింది. భారీ ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు కార్యకర్తలు. ఇంకా వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభకు రానున్నారు చంద్రబాబు. 6:30 చంద్రబాబు ప్రసంగం వుంటుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్. బహిరంగ సభకు బాలకృష్ణ హాజరు కానున్నారు. బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు,…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…
ఏపీలో వైసీపీ నేతలు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల బస్ యాత్ర ఎత్తిపోయింది. వాళ్లే కుర్చీలు తీసుకెళ్తున్నారు.. జనం లేకపోయేసరికి వాళ్లే కుర్చీలను తీసుకెళ్లిపోతున్నారని విమర్శించారు. జగన్ స్వయంగా తమది రివర్స్ పాలన అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బస్ యాత్ర అంతా రివర్సులోనే ఉంది. కైవల్యా రెడ్డి నెల్లూరులో ఆనం కుమార్తెమో కానీ..…
టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్రజల బుగ్గలు గిల్లుతూ.. ముద్దులు పెడుతూ అధికారంలోకి వచ్చాడు ఈ జగన్ మోసపు రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా.. ఎన్నికల ముందు సంక్షేమాన్ని పెంచుతామంటూ ధరలన్నీ పెంచుతున్నాడని, చెత్తపై కూడా పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటామంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 850 మంది మహిళలపై దాడులు,…
తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…