Samajika Nyaya Bheri: ఇది ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల యుగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.
శెట్టి బలిజ వర్గాలు పార్లమెంటు మెట్లు ఎక్కే అవకాశం కల్పించిన మొదటి నాయకుడు జగన్. హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కొమరం భీం, అంబేద్కర్, జ్యోతి రావు పూలే ఆకాంక్షించినట్లు బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. జగన్ పాలనలో సమ సమాజ పాలన చూశాం.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
గతంలో ఏ ప్రభుత్వమూ బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. హోం శాఖ వంటి కీలక బాధ్యతలు నాకు ఇచ్చారంటేనే ముఖ్యమంత్రి మనసు అర్ధం అవుతుంది. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యుగం అన్నారు హోంమంత్రి తానేటి వనిత. జనసేనకు సోషల్ మీడియా ఉంది. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. జగన్ కు జనమే మీడియాగా ఉందన్నారు తానేటి వనిత. సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ న్యాయబేరి బహిరంగ సభలో పాల్గొన్నారు 17 మంది మంత్రులు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదు. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వటమే సామాజిక న్యాయ జరిగినట్లు కాదు. ప్రజలకు లక్షా 20 వేల కోట్లు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించింది. దీని కోసం ఎవరూ రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. గౌరవం గా తీసుకున్నారు. చంద్రబాబు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చాను అంటున్నాడు. దీని కోసం జన్మభూమి కమిటీల ముందు తల వంచుకోవాల్సి పరిస్థితి ఉండేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని కనీసం ఆరోపించగలుగుతున్నాడా??ఈ సభకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!