మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్తో చర్చించారు. CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్ చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు నటించిన సర్కారువారిపాట ఈ మధ్యే విడుదలైంది.. మంచి వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది.. అయితే, ఈ సినిమాలో.. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చూపించారు.. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు.. ఇప్పుడు…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్లలో…
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కొందరు దాడి చేయగా ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని కొడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంజన్ నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్పై దాడి కోసం ఎదురింటి వ్యక్తి ఓ గ్యాంగ్ను రంగంలోకి…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే పలమనేరులో పదో తరగతి…
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం నాడు పోలీసులు అడవిలో గుర్తించారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవిత కుమార్తె జోషిక (4) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు RRR సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు. చిత్తూరు జిల్లా…
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.…
ఏపీలోని చిత్తూరు జిల్లాలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ అభిమానులపై జంతుబలి కేసు నమోదైంది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా కొందరు పవన్ అభిమానులు మేకను బలిచ్చినట్టు చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. పవర్స్టార్…