ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క…
15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ‘వాట్సప్ పరిపాలన అంటూ.. వాటాల పరిపాలన’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని చింతా మోహన్…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130 ప్రతిపక్షాలను నిర్మూలించేందుకేనని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. దేశంలో అనేకమంది సీఎంలపై కేసులున్నాయన్నాయని గుర్తుచేశారు.
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు..
కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. సుప్రీం ధర్మాసనం టీటీడీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు.. సుప్రీంకోర్టు మూడు ప్రశ్నలు అడగడం జరిగింది.. లడ్డూను రజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు?.. కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ…
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు..