Chinta Mohan: ఉద్యోగాలు రాక.. పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు!
- ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చింతా మోహన్ విమర్శలు
- నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?
- తన సొంత నియోజకవర్గానికి కూడా చంద్రబాబు ఏమి చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. ఒక్క ఉద్యోగం అయినా ప్రధాని ఇచ్చాడా?. ఉద్యోగాలు రాక పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు’ అని చింతా మోహన్ ఫైర్ అయ్యారు.
Also Read: Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. తిరుపతి తరహాలో భక్తులకు ఏర్పాట్లు!
Also Read
’15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశాడా?. తన సొంత నియోజకవర్గానికి కూడా ఏమి చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్న చంద్రబాబు కనీసం ఇడ్లీ కొట్టు కూడా పెట్టలేదు. సామాజిక న్యాయం అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య గొడవలు పెట్టారు. దళితులకు న్యాయం అంటున్న నీవు 2 ఏళ్ళు సీఎంగా మాదిగలకు ఇవ్వు. దళితులు, మైనార్టీలు సంతోషంగా లేరు. ఒకప్పుడు పేదల గురించి అసెంబ్లీలో మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు పరిస్తితి అలా లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడుకునేందుకు అసెంబ్లీని వాడుకుంటున్నారు. రాష్ట్రంలో పేరుకే కూటమి.. కానీ వారిలో వారికే ఐక్యత లేదు. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికలు పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబుపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా తప్పు. పెండింగ్ లో ఉన్న 15 మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అమరావతి కి ఉన్న నిధులు మెడికల్ కళాశాలల నిర్మాణానికి లేవా?’ అని చింతా మోహన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!