Chinta Mohan: ఉద్యోగాలు రాక.. పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు!
- ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చింతా మోహన్ విమర్శలు
- నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?
- తన సొంత నియోజకవర్గానికి కూడా చంద్రబాబు ఏమి చేయలేదు
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. ఒక్క ఉద్యోగం అయినా ప్రధాని ఇచ్చాడా?. ఉద్యోగాలు రాక పట్టభద్రులు పారిశుధ్య కార్మికులుగా మారుతున్నారు’ అని చింతా మోహన్ ఫైర్ అయ్యారు.
Also Read: Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. తిరుపతి తరహాలో భక్తులకు ఏర్పాట్లు!
Also Read
’15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశాడా?. తన సొంత నియోజకవర్గానికి కూడా ఏమి చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్న చంద్రబాబు కనీసం ఇడ్లీ కొట్టు కూడా పెట్టలేదు. సామాజిక న్యాయం అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య గొడవలు పెట్టారు. దళితులకు న్యాయం అంటున్న నీవు 2 ఏళ్ళు సీఎంగా మాదిగలకు ఇవ్వు. దళితులు, మైనార్టీలు సంతోషంగా లేరు. ఒకప్పుడు పేదల గురించి అసెంబ్లీలో మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు పరిస్తితి అలా లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడుకునేందుకు అసెంబ్లీని వాడుకుంటున్నారు. రాష్ట్రంలో పేరుకే కూటమి.. కానీ వారిలో వారికే ఐక్యత లేదు. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికలు పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబుపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా తప్పు. పెండింగ్ లో ఉన్న 15 మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అమరావతి కి ఉన్న నిధులు మెడికల్ కళాశాలల నిర్మాణానికి లేవా?’ అని చింతా మోహన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
-
AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!