Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chinta Mohan Said That The Alliance Government Is Using The Laddu Issue For Political Purposes

Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..

NTV Telugu Twitter
Published Date :September 30, 2024 , 8:21 pm
By Rajesh Veeramalla
  • కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. సుప్రీం ధర్మాసనం టీటీడీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు.. సుప్రీంకోర్టు మూడు ప్రశ్నలు అడగడం జరిగింది.. లడ్డూను రజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు?.. కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్నుంచి జవాబు లేదని పేర్కొన్నారు.
Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. సుప్రీం ధర్మాసనం టీటీడీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు.. సుప్రీంకోర్టు మూడు ప్రశ్నలు అడగడం జరిగింది.. లడ్డూను రజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు?.. కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్నుంచి జవాబు లేదని పేర్కొన్నారు. మన తిరుపతిని, మన దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం బాగా వాడుకుంటోంది.. తాను ఆనాడే చెప్పానని.. చంద్రబాబు లడ్డు విషయంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని చింతా మోహన్ అన్నారు.

Read Also: Insurance Premium: బీమా పాలసీలకు కొత్త రూల్స్.. ఎప్పట్నుంచి అమల్లోకి అంటే..!

టీటీడీ ఈవో శ్యామల రావు లడ్డు, నెయ్యి విషయంలో తొందరపడ్డారు.. పప్పులో కాలేశాడని విమర్శించారు. గతంలో టీటీడీ ఈవోలుగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐ వై ఆర్ కృష్ణారావు, గోపాల్ ఎంతో చక్కగా, సౌమ్యంగా పనిచేశారని చింతా మోహన్ తెలిపారు. మరోవైపు.. అమిత్ షా కొడుకుకి సాయంకాలం సమయంలో ఏ పద్ధతి ప్రకారం దర్శనం కల్పించారు..? అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో ఏ ఉన్నతాధికారి పక్కన ఉన్నారు? టీటీడీ సమాధానం చెప్పాలని కోరారు. నిన్న ఒక చిన్న నాయకుడు సిఫార్సు లేఖ ఇస్తే, 20 మందికి శ్రీవారి దర్శనానికి ఎలా అనుమతిస్తారు..? అని అన్నారు.

Read Also: Small savings schemes: చిన్న మొత్తాలపై పాత వడ్డీ రేట్లే.. కేంద్రం ప్రకటన

నిద్రపోతున్న భారతీయ జనతా పార్టీ అపవిత్రత, పవిత్రత అంటూ లడ్డు గురించి, నెయ్యి కల్తీ గురించి గగ్గోలు పెట్టిందని చింతా మోహన్ పేర్కొన్నారు. స్థానికులకు ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం అడిగితే ఇప్పటి వరకు టిటిడి నోరు మెదపడం లేదు.. జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది.. తిరుపతిలో పోలీస్ రాజ్యం నడుస్తోంది.. నెల రోజులు పోలీస్ 30 యాక్ట్ అమలు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. 30 యాక్ట్ పేరుతో సభలు, సమావేశాలు జరగకుండా పోలీసులు పొలిటికల్ పార్టీలను అడ్డుకుంటున్నారు.. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయని చింతా మోహన్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alliance govt
  • chinta mohan
  • Laddu Issue
  • political purposes

తాజావార్తలు

  • KCR Live Updates: కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్.. లైవ్ అప్డేట్స్!

  • KCR: ముగిసిన కేసీఆర్, జస్టిస్ పీసీ ఘోష్ విచారణ.. ఏం విచారించరంటే..?

  • MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!

  • YS Jagan: మా హయాంలో రైతురాజ్యం.. ఇప్పుడు కష్టాల్లో రైతులు

  • Sonam Raghuwanshi: 2 వారాలు గడుస్తున్న దొరకని రాజా మొబైల్.. బెంగళూరు టు మేఘాలయ మిస్టరీ అందులోనే!

  • Jr NTR : ‘వార్ 2’ మూవీ డ‌బ్బింగ్ పనులు.. షురూ చేసిన తారక్

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions