Chinta Mohan: సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర..! కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు..
- సీతారాం ఏచూరి మృతిపై చింతా మోహన్ సంచలన ఆరోపణలు..
- ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది...
- ఏచూరి మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించిన చింతా మోహన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. ఒక స్వైన్ ఫ్లూ కేసు రోగి పక్కన సీతారాం ఏచూరి ఉంచారు.. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.. ఇక, ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా కూడా బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు చింతా మోహన్..
Read Also: Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
మోవైపు.. వైఎస్ జగన్ మాటలు మానవత్వం గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు చింతా మోహన్.. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొట్టించడం మానవత్వమా?.. ఇదేనా ప్రేమ..? అని ప్రశ్నించారు.. సెక్యులరిజం అంటే నిన్నటి వరకు బీజేపీతో కలిసి నాట్యం చేసి మాట్లాడడం ఏంటి? అని ఎద్దేవా చేశారు.. దళితులపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతున్నారు.. కానీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు.. స్కాలర్షిప్ లు ఎందుకు ఆపేశావు అని నిలదీశారు.. ఇక, వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తే ఏమి..? ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకాలు పెట్టి పోయారని వ్యాఖ్యానించారు.. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్ ఉండు అంటూ వైఎస్ జగన్కు సలహా ఇచ్చారు.. నీకు ఉన్న కొంచెం పరువు కూడా తీసేశారని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కాగా, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి.. ఈ నెల 12వ తేదీన కన్నుమూసిన విషం విదితమే.. ఆయన వయసు 72 ఏళ్లు. కొద్దిరోజులుగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడిన ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.. అయితే, చింతామోహన్ ఇప్పుడు ఆయన మృతిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!