Chinta Mohan: అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది.. రాష్ట్ర పరిస్థితి బాలేదు!
- చంద్రబాబు నాయుడు మాటల మనిషి
- 50 అంతస్తుల సచివాలయం కడతారా?
- కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు
- అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని చింతా మోహన్ పేర్కొన్నారు.
‘ఏపీలో గిరిజనులపై అత్యాచారాలు, దాడులు ఎక్కువవుతున్నాయి. గిరిజనులు, దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు మాటల మనిషి. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా?. వైఎస్ జగన్కి భయపడి చంద్రబాబును గెలిపించారు. వికసిత ఆంధ్రను చంద్రబాబు చేయలేడు. చంద్రబాబే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అరకులో మహిళల ముందే గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాలేదు’ అని చింతా మోహన్ అన్నారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
Also Read: Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
‘ఏపీ ప్రజలు అప్పుల్లో ఉన్నారు. 10 రూ.వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు. చంద్రబాబు నాయుడుకు బంధుప్రీతి ఎక్కువ. అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు కనిపిస్తుంది, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు. కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!