Chinta Mohan: అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది.. రాష్ట్ర పరిస్థితి బాలేదు!
- చంద్రబాబు నాయుడు మాటల మనిషి
- 50 అంతస్తుల సచివాలయం కడతారా?
- కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు
- అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని చింతా మోహన్ పేర్కొన్నారు.
‘ఏపీలో గిరిజనులపై అత్యాచారాలు, దాడులు ఎక్కువవుతున్నాయి. గిరిజనులు, దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు మాటల మనిషి. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా?. వైఎస్ జగన్కి భయపడి చంద్రబాబును గెలిపించారు. వికసిత ఆంధ్రను చంద్రబాబు చేయలేడు. చంద్రబాబే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అరకులో మహిళల ముందే గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాలేదు’ అని చింతా మోహన్ అన్నారు.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
Also Read: Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
‘ఏపీ ప్రజలు అప్పుల్లో ఉన్నారు. 10 రూ.వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు. చంద్రబాబు నాయుడుకు బంధుప్రీతి ఎక్కువ. అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు కనిపిస్తుంది, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు. కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!