Chinta Mohan: అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది.. రాష్ట్ర పరిస్థితి బాలేదు!
- చంద్రబాబు నాయుడు మాటల మనిషి
- 50 అంతస్తుల సచివాలయం కడతారా?
- కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు
- అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు? అని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని చింతా మోహన్ పేర్కొన్నారు.
‘ఏపీలో గిరిజనులపై అత్యాచారాలు, దాడులు ఎక్కువవుతున్నాయి. గిరిజనులు, దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు మాటల మనిషి. సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాచారాలు, దాడులు, పేదరికం తొలించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తారా?. వైఎస్ జగన్కి భయపడి చంద్రబాబును గెలిపించారు. వికసిత ఆంధ్రను చంద్రబాబు చేయలేడు. చంద్రబాబే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అరకులో మహిళల ముందే గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాలేదు’ అని చింతా మోహన్ అన్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
‘ఏపీ ప్రజలు అప్పుల్లో ఉన్నారు. 10 రూ.వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఏపీ ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. అమరావతి దేవతల రాజధాని అనేది తప్పు. చంద్రబాబు నాయుడుకు బంధుప్రీతి ఎక్కువ. అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది. మూడు అడుగుల గొయ్యి తీస్తే నీరు కనిపిస్తుంది, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారు. కుప్పంలో కూటికి గతిలేక ప్రజలున్నారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ.. ప్రతి ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!