Chinta Mohan: జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. జమిలితో చంద్రబాబుకే నష్టం..!
- చంద్రబాబు, వైఎస్ జగన్పై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు..
- జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు..
- మళ్లీ జగన్ బలపడే అవకాశం లేదని వ్యాఖ్య..
- జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు ఒప్పుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు.. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు చింతా మోహన్.. ఇక, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడంలేదు.. హైదారాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదు.. ప్రస్తువం ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతోంది.. గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని సూచించారు..
Read Also: Goshamahal Tension: గోషామహల్ బంద్కు స్థానికులు, వ్యాపారులు పిలుపు..
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
మరోవైపు.. దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు చింతా మోహన్.. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనకాడేవారని పేర్కొన్న ఆయన.. మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరాని తనం రూపు మాపాలని గాంధీకి నెహ్రూకు చెప్పారు.. రాజ్యాంగంలో ఎస్సీలకు 15 శాతం ఇచ్చిన ఘనత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కిచ, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు.. అయితే, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయి.. పక్క రాష్ట్రాల్లో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చేస్తున్నారు.. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబుకి దళితుల చేసిన అన్యాయం ఏంటి…? అని నిలదీశారు. దళితులను ఎందుకు విభజించాలని చూస్తున్నారు.. తిరుపతిలో పెట్టాల్సి న రాజధాని విజయవాడలో పెడితే రాయల సీమ ప్రాంతం ఏం అవ్వాలి? అని ప్రశ్నించారు.. రాయల సీమ వాళ్లు బయట పడటం లేదు.. కానీ, ఉడికి పోతున్నారని పేర్కొన్నారు..
Read Also: Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
ఇక, A అంటే అమరావతి P అంటే పోలవరం అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు చింతామోహన్.. ఒక్కో జిల్లా అభివృద్ధికి 5 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. 60 వేల కోట్లు ఒక్క చోటే పెట్టాల్సి న అవసరం లేదన్నారు. వర్గీకరణ ఉద్యోగాలలో జరగాలి… ఎస్సీ కాంట్రాక్టర్ లకు అవకాశాలు ఇవ్వాలి.. బ్యాంక్ ఉద్యోగాలలో ఎస్సీలకు అవకాశాలు ఇవ్వాలని కోరారు.. నేను వర్గీకరణ కు వ్యతిరేకం.. వర్గీకరణ చేస్తే టీడీపీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. వైసీపీ విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టి మంచి పని చేసిందని ప్రశంసలు కురిపించారు.. అయితే, కర్నూలులో హై కోర్టు బెంచ్ వల్ల ప్రయోజనం లేదు… రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కావాలని కోరారు మాజీ ఎంపీ చింతా మోహన్..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..