Chinta Mohan: జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. జమిలితో చంద్రబాబుకే నష్టం..!
- చంద్రబాబు, వైఎస్ జగన్పై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు..
- జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు..
- మళ్లీ జగన్ బలపడే అవకాశం లేదని వ్యాఖ్య..
- జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు ఒప్పుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు.. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు చింతా మోహన్.. ఇక, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడంలేదు.. హైదారాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదు.. ప్రస్తువం ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతోంది.. గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని సూచించారు..
Read Also: Goshamahal Tension: గోషామహల్ బంద్కు స్థానికులు, వ్యాపారులు పిలుపు..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు.. దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు చింతా మోహన్.. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనకాడేవారని పేర్కొన్న ఆయన.. మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరాని తనం రూపు మాపాలని గాంధీకి నెహ్రూకు చెప్పారు.. రాజ్యాంగంలో ఎస్సీలకు 15 శాతం ఇచ్చిన ఘనత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కిచ, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు.. అయితే, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయి.. పక్క రాష్ట్రాల్లో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చేస్తున్నారు.. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబుకి దళితుల చేసిన అన్యాయం ఏంటి…? అని నిలదీశారు. దళితులను ఎందుకు విభజించాలని చూస్తున్నారు.. తిరుపతిలో పెట్టాల్సి న రాజధాని విజయవాడలో పెడితే రాయల సీమ ప్రాంతం ఏం అవ్వాలి? అని ప్రశ్నించారు.. రాయల సీమ వాళ్లు బయట పడటం లేదు.. కానీ, ఉడికి పోతున్నారని పేర్కొన్నారు..
Read Also: Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
ఇక, A అంటే అమరావతి P అంటే పోలవరం అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు చింతామోహన్.. ఒక్కో జిల్లా అభివృద్ధికి 5 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. 60 వేల కోట్లు ఒక్క చోటే పెట్టాల్సి న అవసరం లేదన్నారు. వర్గీకరణ ఉద్యోగాలలో జరగాలి… ఎస్సీ కాంట్రాక్టర్ లకు అవకాశాలు ఇవ్వాలి.. బ్యాంక్ ఉద్యోగాలలో ఎస్సీలకు అవకాశాలు ఇవ్వాలని కోరారు.. నేను వర్గీకరణ కు వ్యతిరేకం.. వర్గీకరణ చేస్తే టీడీపీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. వైసీపీ విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టి మంచి పని చేసిందని ప్రశంసలు కురిపించారు.. అయితే, కర్నూలులో హై కోర్టు బెంచ్ వల్ల ప్రయోజనం లేదు… రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కావాలని కోరారు మాజీ ఎంపీ చింతా మోహన్..
తాజావార్తలు
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!