చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు.
ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
Cockroach: ఏంటి హెడ్డింగ్ చూడగానే బొద్దింక ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదూ.. అవును అది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది.
ప్రస్తుతం చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో గల మైన్యాంగ్ సిటీ పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్యాంగ్లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు.
Evergrande : ఒకప్పుడు చైనా అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్గ్రాండే, 2021లో 300 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎవర్గ్రాండే షేర్ల ట్రేడింగ్ మార్చి 2022 నుండి నిలిపివేయబడింది.
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది.
హాట్పాట్ రెస్టారెంట్గా పిలవబడే పిపా యువాన్ రెస్టారెంట్.. చైనాలోని చాంగ్క్వింగ్ నగర సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో పదో, పాతికో మంది కాదు.. ఏకంగా ఒకేసారి 5 వేల 800 మంది భోజనం చేసేయొచ్చు.
China: చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తలలో పేను గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ చైనాలో మాత్రం ఓ బాలుడికి పేను వేరే చోటును ఎంచుకుంది. ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకన్నట్లు వైద్యులు గుర్తించారు.