China Floods: చైనాను ముంచెత్తిన వరదలు.. 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Floods: భారీ వర్షాలు, వరదలు ఇండియాతోపాటు పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. అలాగే భారీ వర్షాలు, వరదలు చైనాను అతలాకుతలం చేశాయి. ఇప్పటి వరకు చైనాలో వరదల కారణంగా 30 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఒక్క ఆదివారమే 14 మంది మృతి చెందారని తెలిపారు. చైనాలో వర్షాలు వరదల కారణంగా ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని దేశం అంచనా వేస్తోంది. చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదల్లో మునిగిపోవడంతో ఆహార ధాన్యాల సాగు దెబ్బతింది. పొలాల్లోకి భారీగా వరద నీరు నిలిచిపోయింది.
Read also: Bolla Brahma Naidu: లోకేష్కు దమ్ముంటే వినుకొండలో పోటీ చేసి నాపై గెలవాలి..
Also Read
- Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
టైఫూన్ డోక్సూరి దెబ్బకు జులై నుంచి భారీగా వర్షపాతం నమోదైంది. బీజింగ్ హెబెప్రావిన్స్లో దాదాపు 30 మంది మరణించారు. జిలిన్ ప్రావిన్స్లోని షులాన్ నగరంలో ఒక్క ఆదివారమే దాదాపు 14 మంది మరణించారు. వారిలో నగర డిప్యూటీ మేయర్ సహా ముగ్గురు అధికారులు కూడా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారంతా వరద సహాయక చర్యల సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయినట్టు అధికారులు ప్రకటించారు. వరి పంటకు పేరున్న ఉత్తర చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో నదులు పొంగి పొర్లుతుండటంతో పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. కూరగాయలు పండించే గ్రీన్హౌస్లు కూడా చాలా చోట్ల నీటిలో తేలియాడుతున్నాయి. ఈ ప్రావిన్స్లోని 25 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రావిన్స్ రాజధాని హార్బిన్లో దాదాపు 1.6లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించగా.. 90వేల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. వాటితోపాటు షాంఝీలో 42వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించారు. దేశంలోని కీలకమైన సాగుభూములు వరదనీటిలో మునిగిపోవడంతో.. ఈ సారి చైనాలో ఆహార కొరత ఏర్పడవచ్చని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం చైనా వ్యవసాయ శాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. అందులో భాగంగా దేశ వ్యవసాయోత్పత్తిపై భారీగా ప్రతికూల ప్రభావం పడనుందని హెచ్చరించింది. భారీగా ఆహార ధాన్యాలను పండించే హెనాన్ ప్రావిన్స్లో మే నెలలో పడిన వర్షాలు ఎక్కువ మొత్తంలో పంటలను దెబ్బతీశాయని అధికారులు ప్రకటించారు.
- Tags
- 30 People
- china
- died
- Floods
- Overwhelmed
తాజావార్తలు
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
-
Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!