Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.
Read Also:Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
2075లో టాప్-5 ఆర్థిక వ్యవస్థ దేశాలు
2075 సంవత్సరంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ దేశ విలువ 57 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 51.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అవుతుంది. దీని తరువాత యూరో ఏరియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇతర ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని గోల్డ్మన్ సాక్స్ రీసెర్చ్లో భారత ఆర్థికవేత్త శంతను సేన్గుప్తా అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నిపుణులు రాబోయే 20ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని అంటున్నారు. భారత్కు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడం ప్రత్యేకమని గోల్డ్మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!