Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.
Read Also:Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
2075లో టాప్-5 ఆర్థిక వ్యవస్థ దేశాలు
2075 సంవత్సరంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ దేశ విలువ 57 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 51.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అవుతుంది. దీని తరువాత యూరో ఏరియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇతర ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని గోల్డ్మన్ సాక్స్ రీసెర్చ్లో భారత ఆర్థికవేత్త శంతను సేన్గుప్తా అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నిపుణులు రాబోయే 20ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని అంటున్నారు. భారత్కు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడం ప్రత్యేకమని గోల్డ్మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!