Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.
Read Also:Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Also Read
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
2075లో టాప్-5 ఆర్థిక వ్యవస్థ దేశాలు
2075 సంవత్సరంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ దేశ విలువ 57 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 51.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా అవుతుంది. దీని తరువాత యూరో ఏరియా, జపాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే రాబోయే రెండు దశాబ్దాల్లో ఇతర ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని గోల్డ్మన్ సాక్స్ రీసెర్చ్లో భారత ఆర్థికవేత్త శంతను సేన్గుప్తా అన్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నిపుణులు రాబోయే 20ఏళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి అత్యల్పంగా ఉంటుందని అంటున్నారు. భారత్కు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడం ప్రత్యేకమని గోల్డ్మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ఇది దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!